YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శ్రీలంక నుంచి బయలుదేరిన భారతీయులు

శ్రీలంక నుంచి బయలుదేరిన భారతీయులు

శ్రీలంక నుంచి బయలుదేరిన భారతీయులు
న్యూఢిల్లీ జూన్ 1,
వందే భారత్ మిషన్’లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సముద్రమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ఆపరేషన్ సముద్ర సేతు చేపట్టి వేల సంఖ్యలో భారతీయులను తరలిస్తోంది. ఇప్పటికే మాల్దీవుల నుంచి రెండు దఫాల్లో దాదాపు 1500మందిని  ఐఎన్ఎస్ జలాశ్వా స్వదేశానికి తీసుకొచ్చింది. తాజాగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి మరోసారి ఐఎన్ఎస్ జలాశ్వా సిద్ధమయ్యిం ది.దాదాపు 700 మంది భారతీయులతో కొలంబో నుంచి తమిళనాడులోని ట్యూటికోరిన్కు బయలుదేరనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే నౌకలోకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

Related Posts