నెల్లూరు గ్రామీణ నియోజవర్గ గానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకొస్తాం
శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు జూన్ 1,
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని సాధించి , రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకొస్తామని నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొండ్ల పూడి. దేవరపాలెం గ్రామాలలో 5 వ్యయంతో సిసి రోడ్లు , డ్రైన్లు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల భవనాలు, మంచినీటి బోర్లు తదితర పనులకు కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ప్రమాణాలతో అత్యంత వేగంగా పనులను పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్రంలోనే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి గుర్తింపు తీసుకు వచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికీ దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషి ఎనలేదని, జగన్మోహన్ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.