YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డాక్టర్ సుధాకర్ కేసులో దూకుడు పెంచిన సీబీఐ

డాక్టర్ సుధాకర్ కేసులో దూకుడు పెంచిన సీబీఐ

డాక్టర్ సుధాకర్ కేసులో దూకుడు పెంచిన సీబీఐ
అమరావతి జూన్ 1
హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ సుధాకర్ కేసులో నగర పోలీసులపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచారు. సీబీఐకి ఎనిమిది వారాల సమయం ఇవ్వడంతో ఆ లోపు పూర్తీ నివేదిక తయారుచేసేపనిలో సీబీఐ అధికారులు నిమజ్ఞమైయ్యారు. దీనితో  శనివారం ప్రభుత్వ మానసిక ఆస్పత్రి కేజీహెచ్ లో విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఆదివారం కూడా కేజీహెచ్ లోనే దర్యాప్తు నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో సంప్రదించారు. ఆ తరువాత  డాక్టర్ సుధాకర్ కు కేజీహెచ్ లో వైద్యం అందజేసిన ప్రక్రియకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను సూపరింటెండెంట్ ఛాంబర్ లోని టీవీలో పరిశీలించారు. ఫుటేజీల్లో ఇద్దరు వ్యక్తుల కదలికలు ప్రధానంగా ఉన్నట్టు గుర్తించడంతో వారి గురించి ఆస్పత్రి అధికారులను ఆరా తీశారు. వారిద్దరూ పీజీ విద్యార్థులని చెప్పడంతో వారిని విచారించాల్సి ఉన్నందున సోమవారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఆ తరువాత డాక్టర్ సుధాకర్కు వైద్యం అందజేసిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ ఫిజీషియన్ డాక్టర్ కనకమహాలక్ష్మిని విచారించారు. డాక్టర్ సుధాకర్ను  ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడకు తీసుకువచ్చారు. ఎలాంటి రిమార్కులు గుర్తించారు. మానసిక వైద్యశాలకు రిఫర్ చేయడానికి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అంటూ పలు విషయాల గురించి ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజీలకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను సోమవారం తమకు అప్పగించాలని కోరుతూ ఒక నోటీసు అందజేశారు. క్యాజువాలిటీ మెడికో లీగల్ కేసులకు సంబంధించిన రికార్డును సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాక్టర్ సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు సీబీఐ కి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

Related Posts