అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్ జూన్ 2
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభ వద్ద, గుత్తా సుఖేందర్రెడ్డి శాసనమండలి వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనేక దశాబ్దాల పోరాట ఫలితంగా తెలంగాణను సాధించుకున్నామని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రజలు కలలు కన్న తెలంగాణను కేసీఆర్ చేసి చూపించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.