YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతిపై జగన్ కు నివేదిక

అమరావతిపై జగన్ కు నివేదిక

అమరావతిపై జగన్ కు నివేదిక
విజయవాడ,జూన్ 2,
ఏపీ రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతికి సంబంధించి సీఆర్డీఏ సంచలన నివేదిక ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేయాలంటే రూ.18 వేల కోట్లు అవసరమవుతాయని తేల్చింది. సీఆర్‌ర్డీఏ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి నివేదికను అందించింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అధికారులు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి సీఎంకు అందజేశారు.అమరావతిలో జరుగుతుున్న పనులను ఎంత మేర పరిమితం చేయాలి.. ఎంత ఖర్చవుతుంది.. రివర్స్‌ టెండర్లు పిలవాలా.. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లను కొనసాగించాలా అనే అంశాలపై ఐఐటీతో అధ్యయనం చేయించాలని గతంలోనే సీఎం ఆదేశించారు.ఐఐటీ రూర్కె నుంచి ఒక టీమ్ వచ్చి ఈ పనులను పరిశీలించారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు, మౌలిక సౌకర్యాల కల్పన, రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వడం వంటి పనులు పూర్తి చేయడం వంటి వాటిని పరిశీలించి పనులు ఎంత మేర చేయాలో ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ రిపోర్టులో అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

Related Posts