జేసీ ట్రావెల్స్ వాహనాలు సీజ్
అనంతపురం జూన్ 2
మరోసారి జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన వాహనాలని రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. బీస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో సదరు వాహనాలను సీజ్ చేశారు. వీటిని నాగాలాండ్ తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించారు. గతంలో 57 వాహనాలను సీజ్ చేశారు అధికారులు. తాజాగా సోమవారం నాడు నాలుగు టిప్పర్లను సీజ్ చేశారు. మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామని డీటీసీ శివరామప్రసాద్ పేర్కొన్నారు.