YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అస్సాంలో భారీ వర్షాలు..  కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి..

అస్సాంలో భారీ వర్షాలు..  కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి..

అస్సాంలో భారీ వర్షాలు.. 
కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి..
గువహటీ  జూన్ 2
గత రెండు రోజులుగా అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరుసగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతిచెందినట్లు సమాచారం. అనేక మంది గాయపడ్డారు. దక్షిణ అస్సాంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది. బరాక్ వ్యాలీ ప్రాంతంలో ఉన్న పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి అస్సాంలో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. కచార్ జిల్లాలో ఏడు మంది, హైలకండి జిల్లాలో ఏడు మంది, కరీంగంజ్ జిల్లాలో ఆరు మంది మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో పదకొండు మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు వున్నారు. అధికారులు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 

Related Posts