YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

8 నుంచి హోటల్స్  ఓపెన్

8 నుంచి హోటల్స్  ఓపెన్

8 నుంచి హోటల్స్  ఓపెన్
విజయవాడ, జూన్ 2,
లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. మంగళవారం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే హోటల్స్‌ తిరిగి ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. హరిత హోటల్స్‌కు ఆన్‌లైన్ బుకింగ్ వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆతిథ్య రంగానికి శుభవార్తేనని పేర్కొన్నారు.అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్డ్రవ్యాప్తంగా 12 పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి అవంతి వెల్లడించారు. గడిచిన ఏడాది పాలనలో పర్యాటక రంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఏడాది పాలనలో పర్యాటకుల సంఖ్య 21 శాతం పెరిగిందన్నారు. బోటింగ్ కార్యకలాపాల నియంత్రణ, భద్రతకు రాష్ట్రంలోని 9 ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు నిర్మించినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆదాయ మార్గాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.ఇందుకోసం ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్‌ను కూడా నిర్వహిస్తున్నామని మంత్రి అవంతి తెలిపారు. గండికోట వద్ద ఉన్న ఎడ్వేంజర్ స్టోర్స్‌కు కూడా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ఏపీ పర్యాటక శాఖ జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకుందన్నారు. అంతేగాక శిల్పారామాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక నిర్వచిస్తున్నామని, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు యూత్ ఎక్చేంజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Related Posts