YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం దేశీయం

 క్వారంటైన్ సెంటర్లలో కండోమ్

 క్వారంటైన్ సెంటర్లలో కండోమ్

 క్వారంటైన్ సెంటర్లలో కండోమ్
పాట్నా, జూన్ 2,
14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని వెళ్తున్న వలస కూలీలకు బిహార్ ప్రభుత్వం కండోమ్‌లు ఇచ్చి పంపిస్తోంది. వీటితో పాటు గర్భనిరోధక సాధనాలు, ప్రెగ్నెన్సీ కిట్లను అందజేస్తోంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ సాధనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బిహార్ ప్రభుత్వం చెబుతోంది. దేశంలో జనసాంద్రత అధికంగా ఉన్న బిహార్.. ఫ్యామిలీ ప్లానింగ్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఇలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. కొవిడ్-19తో దీనికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది.లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు కేంద్రం ఇచ్చిన సడింపులతో స్వస్థలాలను చేరుకున్నారు. అయితే.. ఇలా చేరుకున్న వలస కార్మికులను 14 రోజుల క్వారంటైన్ అనంతరమే ఇంటికి పంపిస్తున్నారు. బిహార్‌లో ఇలా 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న కార్మికులకు అధికారులు కండోమ్‌లను ఉచితంగా అందజేస్తున్నారు.ఫ్యామిలీ ప్లానింగ్, అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం కూడా తమ బాధ్యత అని ఓ అధికారి చెప్పారు.గోపాల్‌గంజ్, జాముయ్, సమస్తీపూర్, సూపౌల్, సరన్, రోహ్‌తాస్, చంపారన్ జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉచిత కండోమ్‌ల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలు, పరీక్షలు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం‌లతోనూ ఉచితంగా కండోమ్‌లు, ప్రెగ్నెన్సీ కిట్లను పంపిణీ చేసే యోచనలో బిహార్ ప్రభుత్వం ఉంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్‌ ముగించుకుని వెళ్లినట్లు అధికారులు తెలిపారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. జూన్ 15తో క్వారంటైన్‌ కేంద్రాల సేవలు ముగియనున్నాయని తెలిపారు.

Related Posts