YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు

డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు

డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు
విశాఖపట్టణం, జూన్ 3, 
విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగు రోజులుగా ఈ కేసుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు అధికారులు. నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌ సిబ్బందితో పాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి అధికారులను, వైద్యులను ప్రశ్నించారు. అయితే విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు ఫైల్ చేశారు. కేసు వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. సుధాకర్‌పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సీబీఐ విశాఖలో కొందరు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఈ నెల 16న డాక్టర్ సుధాకర్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్‌ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరిపింది. అలాగే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.విశాఖ మెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ప్రభుత్వం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుధాకర్‌ చికిత్సపొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్‌ జడ్జిని ఆదేశించింది. గురువారం సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని సూచించింది. తర్వాత సుధాకర్ స్టేట్మెంట్ పరిశీలించి.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది.డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో ఆస్పత్రిలో మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ ఆరోపించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.. ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులు ఆయన కనిపించ లేదు. మళ్లీ ఈ నెల 16న విశాఖలో ప్రత్యక్షమయ్యారు.

Related Posts