ఏడాదిలొ రాష్ట్రం ఆధోగతి
విశాఖపట్నం జూన్ 3
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అధొగతి పాల్జేసిందని విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు అన్నారు. రాప్టంలో కూల్చటం తప్ప శంకుస్టాపనలు చెయ్యలేదని విమర్శించారు. వలస కార్మికులు విషయంలో పూర్తి విఫలం చెందిందని ఆరోపించిన ఆయన కరోనా వ్యాధిని నియంత్రించడంలోనూ తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. గ్రామ వాలంట్రీలు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వస్తే ఇప్పుడు విద్యుత్ చార్జీలు,మద్యం ధరలు అధికంగా విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. ముఖ్యంగా గాజువాక వద్ద గత ప్రభుత్వం హాయంలో టోల్ గెట్ ను ఎత్తివేస్తే ఇప్పుడు మళ్లీ పునప్రారంభించారని అన్నారు. స్టీలు ప్లాంట్ నిర్వాసితులకు అర్ కార్డు విషయంలో తగిన న్యాయం చెయ్యాలని కోరారు.