YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 తాళిబొట్టు తాకట్టు పెట్టి అంత్యక్రియలు

 తాళిబొట్టు తాకట్టు పెట్టి అంత్యక్రియలు

 తాళిబొట్టు తాకట్టు పెట్టి అంత్యక్రియలు
బెంగళూర్, జూన్ 3, 
కరోనా మహమ్మారితో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న యోధులపై ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించాయి. యుద్ధ విమానాల ద్వారా పూలవర్షం కురిపించి భారత త్రివిధ దళాలు వారికి ఘనంగా జేజేలు పలికాయి. కానీ, ఇవేవీ వారికి ఏవిధంగానూ ఊరట కలిగించడం లేదు. మరణిస్తే దిక్కూ మొక్కూ లేకుండా పోతోంది. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన హృదయాలను కలచివేస్తోంది. రెండు నెలలుగా కరోనా రోగుల సేవలో విరామం లేకుండా పనిచేస్తున్న ఓఅంబులెన్స్ డ్రైవర్.. అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తే, అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక అతడి భార్య తన తాళిబొట్టును తాకట్టు పెట్టిన దైన్యమిది.కర్ణాటకలోని గదగ్‌ జిల్లా కొన్నూర్‌కు చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఉమేశ్ హదగలి రెండు నెలలుగా కోవిడ్‌-19 విధుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. మే 27న ఉదయం 9 గంటలకు అతడు విధుల నిమిత్తం ఇంటి నుంచి బయల్దేరాడు. కాసేపటికే అతడి సహోద్యోగి ఉమేశ్ భార్య జ్యోతికి కాల్ చేసి అతడు తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధ పడుతున్నట్లు సమాచారం ఇచ్చాడు. రామదుర్గలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు.డ్రైవర్ ఉమేశ్‌ను పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో ఎస్‌డీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఉమేశ్ ప్రాణాలు విడిచాడు. ఉమేశ్ అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు లేక అతడి భార్య జ్యోతి పలువురిని సాయం అర్థించింది. ఆమెను ఆదుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చుకుంది. అనంతరం కొంత మంది దగ్గరి బంధువులు, ఉమేశ్‌తో కలిసి పనిచేస్తున్న కొంత మంది సాయంతో అతడి అంత్యక్రియలు పూర్తి చేసింది.సాయం కోరుతూ సోషల్ మీడియాలో జ్యోతి పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. రెండు నెలలుగా కొవిడ్-19 రోగుల సేవలో విరామం లేకుండా పనిచేస్తూ తన భర్త గుండెపోటుతో మరణించాడని.. ఏడేళ్ల, పన్నెండేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలను పోషించడానికి సాయం చేయాలని ఆమె అర్థించింది. జ్యోతి విషయం సీఎం యెడియూరప్ప దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు.కర్ణాటక సీఎం యెడియూరప్ప  జ్యోతికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం, బీమా మొత్తం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తన ఇద్దరు పిల్లలను చదివించడానికి ఏదైనా ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రిని జ్యోతి కోరింది. తన భర్త ఉమేశ్ గత తొమ్మిదేళ్లుగా అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలు అందిస్తున్నాడని ఆమె తెలిపింది.

Related Posts