YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

 పైశాచిక ఆనందానికి ఏనుగు బలి

 పైశాచిక ఆనందానికి ఏనుగు బలి

 పైశాచిక ఆనందానికి ఏనుగు బలి
తిరువనంతపురం, జూన్ 3,
మానవత్వం మరిచిన కొందరి పైశాచిక ఆనందానికి ఏనుగుతోపాటు దాని కడుపులోని బిడ్డ కూడా బలైంది. ఇంతకూ ఆ ఏనుగు చేసిన తప్పిదం.. పిలిచి ఇచ్చిన పండును ఆనందంతో స్వీకరించడమే. కేరళలోని మలప్పురంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆడ ఏనుగు ఊళ్లో నుంచి వెళ్తుండగా కొందరు దానికి పైనాపిల్ ఆశ జూపారు. ప్రేమతో ఇస్తున్నారనుకొని ఆ ఏనుగు పండును తీసుకొని నోట్లో పెట్టుకుంది. టపాసులతో నింపిన పైనాపిల్ కావడంతో అది నోట్లో పెట్టుకోగానే పేలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ఏనుగు రక్తమోడుతూ.. అంత బాధలోనూ ఎవరికీ హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లి పోయింది.రక్తం కారుతుండటం.. ఈగలు చుట్టుమూగడంతో బాధ భరించలేక ఏనుగు వెల్లియార్ నదిలోకి వెళ్లి నిల్చుంది. కాస్త ఉపశమనం లభించడంతో అలాగే ఉండిపోయింది. గాయం కారణంగా ఆహారం తీసుకునే అవకాశం లేకపోవడంతో రోజుల తరబడి నీళ్లు తాగుతూ బతికింది. ఏనుగు నీట్లోనే కదలకుండా ఉండిపోవడాన్ని గమనించిన కొందరు వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం అందించారు.ఏనుగును బయటకు రప్పించే ప్రయత్నం చేయాలని భావించారు. కానీ చిక్కి శల్యమైన ఆ ఏనుగు నీటిలోనే ప్రాణాలు వదిలింది. దీంతో దాని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి చూడగా.. అది గర్భంతో ఉందని.. దాని కడుపులోని బిడ్డ సైతం చనిపోయిందని తెలిసి డాక్టర్లు, అటవీ శాఖ సిబ్బంది ఎంతో బాధపడ్డారు.ఈ ఘటనకు కారణమైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెబుతున్నారు. మే 23న ఏనుగు అటు ఇటు తిరుగుతున్న విషయమై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది వెళ్లి చూడగా అది నీటి కోసం వెతుకుతోందని గమనించారు. మరుసటి రోజు వెల్లియార్ నదిలోకి వెళ్లిందని తెలిసిందని అటవీ శాఖ అధికారి తెలిపారు. మే 27న ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది.

Related Posts