YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

11 ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్

11 ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్

11 ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్
విజయవాడ, జూన్ 3,
ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు. కరోనా కట్టడితో పాటూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా.. లాక్‌డౌన్‌ అమలు,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలకంగా చర్చించనున్నారు. పోతిరెడ్డి వివాదం, నిమ్మగడ్డ రమేష్ వివాదాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి నెల రెండో, నాలుగో బుధవారాల్లో మంత్రివర్గ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో సమావేశాలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది

Related Posts