నెల్లూరు వైసిపి లో వార్
నెల్లూరు జూన్03
ఇరిగేషన్ మంత్రి అనిల్ యాదవ్ ని మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి టార్గెట్ చేసారు. బుధవారం మీడియాతో ఆనం మాట్లాడారు. ఇరిగేషన్ శాఖ వైఫల్యంతో ప్రజలు,రైతులు ఇబ్బందులు పడుతున్నారని అయన వ్యాఖ్యానించారు. జిల్లా ప్రభుత్వాధికారులపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని అయన ఆరోపించారు. ఎస్ఎస్ కెనాల్ను పరిశీలించాలని సీఎం చెప్పినా అధికారులు వినడం లేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న తీరు ఎప్పుడూ చూడలేదని అయన మండిపడ్డారు.