YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ అర్ధం చేసుకోవాలి

సీఎం జగన్ అర్ధం చేసుకోవాలి

సీఎం జగన్ అర్ధం చేసుకోవాలి
కడప  జూన్ 4,
గ్రామ సచివాలయాల రంగుల గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.   కడప జిల్లా వేంపల్లె లోని ఆయన స్వగృహంలో  అయన మీడియాతో మాట్లాడారు. తులసి రెడ్డి మాట్లాడుతూ  మీకు 150 లేదా 175 సీట్లు వచ్చినా  పరిపాలనా నా యిష్టం నా రాష్ట్రం అంటే కుదరదని,  ఒక జీవో ఇచ్చే ముందు చట్టం బద్దంగా  ఉందా లేదా అని ఆలోచించాలని సూచించారు.  తక్కువ కాలంలో కోర్టు చేత అచ్చింతాలు తిన్న ప్రభుత్వం ఇంకొకటి లేదని అన్నారు.  కనీసం భవిష్యత్తులో అయినా ఒక జీవో ఇచ్చే ముందు చట్ట పద్ధతుల్లో ఉందా లేదా అని ఆలోచించి ఇవ్వాలని సూచించారు.  అలాగే వాహన మిత్రకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 262 కోట్లను...ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, క్రిస్టియన్, కార్పొరేషన్ల నుంచి మళ్లించడం జరిగిందని తెలిపారు.  గతంలో కూడా అమ్మఒడి పథకానికి ఈ కార్పొరేషన్ల నుంచి 2108 కోట్లు మళ్లించడం జరిగిందని చెప్పారు.  ఈ కార్పొరేషన్లో నిధులు లేక నిర్వీర్యం అయిపోయాని చెప్పారు. అమ్మఒడికి గని వాహన మిత్ర గని బడ్జెట్లో నిధులు మీరు డైరెక్ట్ గా విడుదల చేయాలని కోరారు.  వాహన మిత్ర పథకం కింద ఇంకా నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరలేదని చెప్పారు.  కడప జిల్లాలోనే దాదాపు ఇరవై వేల మంది ఈ పథకానికి అనర్హులయ్యారని చెప్పారు.  

Related Posts