ఏడాది పాలనలో చారిత్రాత్మక నిర్ణయాలు
రాజమండ్రి జూన్ 4,
కేంధ్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయదారుడ్ని కూడా వ్యాపారవేత్తగా మార్చేలా 20 పాయింట్ ఫార్ములాను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాపారవేత్తలతో సమానంగా వ్యవసాయదారులను ప్రొత్పహించేలా వారిని అభివృద్దిపదంలో నడిపించేందుకు మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. మోదీ ఏడాది పాలనలో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పులను ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు. అనేక అవకతవకలు జరిగాయని చెప్పిన ఆయన ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వెయ్యడం ఆపై కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చెయ్యడం జగన్ చిత్తశుద్దికి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు.