జగన్ ది సుపరిపాలన
చిత్తూరు జూన్ 04
దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఏపీ సిఎం పాలన అందిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేలా విధంగా కృషి చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకూ ఇస్తామన్న 10 వేల రూపాయలను నాలుగు నెలలు ముందుగానే అందించడం వారి చిత్తశుద్దికి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. ఏపీలో సమర్ధవంతంగా పాలన అందించడంతో పాటు పేదలకు భరోసాను ఇచ్చేలా జగన్ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు.