YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 గ్రామాలకు విస్తరించిన మహమ్మారి

 గ్రామాలకు విస్తరించిన మహమ్మారి

 గ్రామాలకు విస్తరించిన మహమ్మారి
న్యూఢిల్లీ, జూన్ 5
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో మహమ్మారి ప్రభావం ఎక్కువగా నగరాలు, పట్టణాల్లో కనిపించగా.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ కలవరపెడుతోంది. ఆంక్షలను సడలించడం.. ప్రజారవాణాను అనుమంతించడంతో పట్టణాల నుంచి గ్రామాలకు రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వైరస్ పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వ్యాప్తిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు గ్రామాలకు చేరుకోవడంతో వారి ద్వారా కూడా కోవిడ్‌-19 విస్తృతమవుతోంది. వివిధ రాష్ట్రాల నివేదికల ప్రకారం.. గ్రామాల్లో 30 నుంచి 80 శాతం మేర కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగించే అంశం. రాజస్థాన్‌కు వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికులు చేరుకోవడంతో ప్రస్తుతం అక్కడ నమోదయిన కేసుల్లో 30 శాతం వరకు గ్రామీణ జిల్లా ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. దుంగార్‌పూర్, జాలోర్, జోధ్‌పూర్, నగౌర్, పాలీ వంటి జిల్లాల్లో రికార్డు స్థాయిలో వలస కార్మికులు వైరస్ బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 396 కరోనా క్లస్టర్స్ ప్రాంతాలు ఉండగా..వీటిలో గ్రామీణ మండలాలు 207 వరకు ఉండటం గమనార్హం. వైరస్‌ ఇంకా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదని భావిస్తున్న తరుణంలో ప్రస్తుత కేసుల నమోదు వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. మాస్క్‌ల ప్రాధాన్యాన్ని సరిగా గుర్తించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం తదితర కారణాలతో గ్రామాలలో వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన ఓ వ్యక్తి గుంటూరు మార్కెట్‌లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి పాజిటివ్‌ రావడంతో ఆ గ్రామంలో ఆందోళన నెలకొంది. పల్లెల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో గడచిన మూడు వారాల్లో 1,500 మందికి వైరస్ సోకగా.. 500 కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.ఒడిశాలో 80 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 4.5 లక్షల మంది వలస కూలీలు ఒడిశాకు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. గ్రామాలకు వచ్చిన వలస కార్మికులను వేరే ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నాయి. కొందరు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.కేరళలోని సరిహద్దు జిల్లాలు కాసర్‌గఢ్ (112), పాలక్కడ్‌ (144)గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. బెంగాల్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. మాల్దా, ఉత్తర, దక్షిణ దింజాపూర్, హూగ్లీ, కుచ్‌బెహార్ జిల్లాలకు 6 లక్షల మంది వలస కార్మికులు చేరుకున్నారు. బిహార్‌లో మొత్తం 4,049 కేసులు నమోదు కాగా.. వీరిలో 2,905 మంది వలస కార్మికులే కావడం గమనార్హం. చత్తీస్‌గఢ్‌కు రెండు లక్షల మంది చేరుకోగా.. అక్కడ నమోదయిన కేసుల్లో 90 శాతం వలస కార్మికులు ఉన్నారు.ఉత్తర ప్రదేశ్‌కు 30 లక్షల మంది వలస కార్మికులు ఇప్పటి వరకూ చేరుకున్నారు. అక్కడ నమోదయిన కేసుల్లో 70 శాతం మంది వలస కార్మికులే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తమిళనాడులోని 78 శాతం పట్టణ ప్రాంతాల్లోనే పాజిటివ్ కేసులు ఉన్నాయి. చెన్నై, కోయంబేడు నుంచి వివిధ గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తోంది.

Related Posts