YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాసలో చేరికలు

తెరాసలో చేరికలు

తెరాసలో చేరికలు
కామారెడ్డి  జూన్ 5  
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,  ప్రజాప్రతినిధులు, 500 మంది కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు,  భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి  ఆధ్వర్యంలో తెరాస పార్టీలో చేరారు. బాన్సువాడ పట్టణంలోని  పార్టీ  నియోజకవర్గ  కార్యాలయంలో  వారందరికి గులాబీ కండువా కప్పి మంత్రి  పార్టీలోకి ఆహ్వానించారు.  వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తగిలేపల్లి  ఎంపీటీసీ  బక్క నారాయణ, ముదిరాజ్ సంఘం మండలం అధ్యక్షుడు, జాకోరా గ్రామ ఎంపీటీసీ ఎండుగుల సాయిలు,  జాకోరా మాజీ సర్పంచ్, పీఏసీఎస్  జాకోరా డైరెక్టర్ బంజే గంగారాం  మరో 500 మంది కార్యకర్తలు తెరాసలో చేరారు.

Related Posts