YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 నన్ను చంపడానికి అఖిల కుట్ర చేసింది

 నన్ను చంపడానికి అఖిల కుట్ర చేసింది

 నన్ను చంపడానికి అఖిల కుట్ర చేసింది
కర్నూలు, జూన్ 5
భూమా అఖిలప్రియ దంపతులు తన హత్యకు కుట్ర చేశారంటున్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి.వీరిలో అఖిలప్రియ ఏ4, ఆమె భర్త భార్గవ్ ఏ5గా ఉన్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి. తనను చంపడానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు ప్రయత్నించారని.. రూ.కోటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రామిరెడ్డి, రవిచంద్రారెడ్డిలు చెరో రూ.50లక్షలకు ఈ మర్డర్ ఒప్పుకున్నారని.. వీరిని పోలీసులు అరెస్ట్ చేస్తే విషయం బయటకు వస్తుందన్నారు. భూమా అఖిలప్రియ పీఏ వీళ్లకు డబ్బులు ఇచ్చారన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు ముద్దాయిలు ఉన్నారని.. వీరిలో అఖిలప్రియ ఏ4, ఆమె భర్త భార్గవ్ ఏ5గా ఉన్నారని చెప్పుకొచ్చారు. కడప జిల్లా పోలీసులు లేకపోతే హత్య జరిగేదన్నారు. సుబ్బారెడ్డి.ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ఓ ముఠా కుట్ర పన్నింది. మార్చిలో పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగిన కడప చిన్నచౌక్‌ పోలీసులు.. సుపారి తీసుకున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఆ ముఠా నుంచి రూ.3.20 లక్షల నగదు, ఓ పిస్తోలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యయత్నం కేసులో ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న మాదా శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు గాను జరిపిన ఆర్థిక లావాదేవీల్లో శ్రీనివాసులు ముఖ్య పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.ఏవీ సుబ్బారెడ్డి దివంగత భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. నాగిరెడ్డి మరణం తర్వాత భూమా ఫ్యామిలీతో సుబ్బారెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. కుమార్తె భూమా అఖిలప్రియ, ఏవీల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పిలిచి కలిసి పనిచేయాలని సూచించారు. తర్వాత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓడారు.. ఏవీ సుబ్బారెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి ఆయన హత్యకు కుట్ర పన్నడం కలకలంరేపింది.

Related Posts