YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చారా : హైకోర్టు ప్రశ్న

డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చారా : హైకోర్టు ప్రశ్న

డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చారా : హైకోర్టు ప్రశ్న
హైద్రాబాద్, జూన్ 5
హైదరాబాద్‌లో వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇచ్చారా అని ప్రశ్నించింది. ఒకవేళ పీపీఈ కిట్లు ఇస్తే వైద్య సిబ్బందికి కరోనా ఎలా సోకిందని ప్రశ్నించింది. జూన్ 8లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని... అందువల్లే డాక్టర్లకు ఇన్ఫెక్షన్ సోకిందంటూ దాఖలైన పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణలో కరోనా టెస్టులను తక్కువ సంఖ్యలో చేయడం పట్ల గతంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు కోవిడ్ పరీక్షలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.హైదరాబాద్‌లో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రుల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లకు కరోనా సోకింది. నగరంలో 31 మంది వైద్య సిబ్బంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది.కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న గాంధీ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్లకు మాత్రమే ప్రభుత్వం పీపీఈ కిట్లు అందజేస్తోంది. కానీ ఔట్ పేషెంట్లు ఎక్కువగా వచ్చి వెళ్లే మిగతా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పీపీఈ కిట్లను అందజేయడం లేదు. రీడింగ్ రూమ్‌లు, పీజీ వైద్య విద్యార్థుల హాస్టల్స్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.తెలంగాణలో కరోనా కేసులు 3 వేలు దాటగా.. 99 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్క రోజే 129 కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 108 కేసులు నమోదయ్యాయి

Related Posts