YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 కరోనా వ్యక్తికి అంత్యక్రియలు చేసేస్తారా.

 కరోనా వ్యక్తికి అంత్యక్రియలు చేసేస్తారా.

 కరోనా వ్యక్తికి అంత్యక్రియలు చేసేస్తారా.
హైద్రాబాద్, జూన్ 5
నా వైరస్ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన హయత్‌నగర్ వాసి మధుసూదన్ మరణించారా లేదా అనే విషయం స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మధుసూదన్ మరణిస్తే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ మదుసూధన్ మరణంపై ఆయన భార్య మాధవి అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త ఆచూకీ తెలియడం లేదని మే 21న ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని మాధవి ప్రశ్నించారు.హయత్‌నగర్‌కు చెందిన మధుసూదన్ గాంధీ హాస్పిటల్‌లో కరోనాకు చికిత్స పొందుతూ మే 1న చనిపోయాడు అంతకు ముందే మధుసూదన్ తండ్రి ఈశ్వరయ్య కూడా కోవిడ్ బారిన పడి చనిపోయాడు. ఆ కుటుంబంలోని అందరికీ ఇన్ఫెక్షన్‌ సోకడంతో హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మధుసూదన్ మరణించిన విషయమై గాంధీ హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆయన మృతదేహానికి జీహెచ్ఎంసీ అధికారులు అంత్యక్రియలను నిర్వహించారు.కరోనా నుంచి కోలుకున్న మాధవి తన భర్త గురించి హాస్పిటల్ వర్గాలను ప్రశ్నించగా.. చనిపోయాడని చెప్పారు. అనుమానం వచ్చిన ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా మధుసూదన్ అంత్యక్రియలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆరోగ్య శాఖ మంత్రి మధుసూదన్ తెలిపారు. అప్పటికే కుటుంబంలో ఒకరు కరోనాతో మరణించడంతో మధుసూదన్ కూడా చనిపోయాడని చెబితే.. కరోనా చికిత్స పొందుతున్న భార్య మాధవి షాక్‌కు గురవుతుందనే ఉద్దేశంతోనే చెప్పలేదన్నారు. డెడ్ బాడీని మార్చురీలో ఉంచే పరిస్థితి కూడా అప్పట్లో లేదన్నారు.కాగా ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని మధుసూదన్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. మధుసూదన్ మరణించారా లేదా అనే విషయాన్ని జూన్ 5లోగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంత్యక్రియలు నిర్వహిస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని ఆదేశించింది.

Related Posts