YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

తబ్లీగ్ పై దర్యాప్తు అవసరం లేదు

తబ్లీగ్ పై దర్యాప్తు అవసరం లేదు

తబ్లీగ్ పై దర్యాప్తు అవసరం లేదు
న్యూఢిల్లీ జూన్ 5
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు దోహదం చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ ప్రార్థనలు వల్లే వైరస్ వ్యాపించింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అంతంతమాత్రంగానే ఉన్న దశలో ఢిల్లీలోని నిజాముద్దీన్లో నిర్వహించిన మర్కజ్ మత కార్యక్రమం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. వీరి ద్వారా కరోనా వైరస్ వ్యాపించింది. పర్యాటక వీసాపై భారత్కు వచ్చిన కొంత మంది విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, కరోనా విలయానికి కారణమయ్యారు. ఈ నేపథ్యంలో 2,200కు పైచిలుకు విదేశీయులను కేంద్ర హోంశాఖ బ్లాక్ లిస్టులో పెట్టింది. వీరు పదేళ్ల పాటు భారత్లోకి రాకుండా నిషేధం విధించింది.తాజాగా, ఈ తబ్లీగ్ జమాత్ మత సమ్మేళనంపై సీబీఐ దర్యాప్తు అవసరంలేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడ్విట్ దాఖలు చేసిన కేంద్రం.. ఈ విషయంలో దర్యాప్తును చట్టం ప్రకారం రోజువారీ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని, సమయానుసారంగా నివేదికను సమర్పించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. తబ్లిగ్ జమాత్ మత సమ్మేళనాన్ని ఆపడంలో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని, ఈ లోపాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రియా పండిత అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం అఫిడ్విట్ దాఖలు చేసింది. తబ్లీగ్ జమాత్ అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడిందని ఆరోపిస్తూ గతవారం ఆ సంస్థ సహా మరికొందరిపై ప్రాథమిక విచారణకు సీబీఐ కేసు నమోదుచేసింది. ఇదిలావుండగా, ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మర్కజ్ ప్రార్థనలకు హాజరైన విదేశీ పౌరులపై ఢిల్లీ పోలీసులు పలు చార్జిషీట్లు దాఖలు చేశారు. ఐపీసీ, విపత్తు నిర్వహణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్పై పలు కేసులు కూడా నమోదయ్యాయి.

Related Posts