YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆరోగ్యం దేశీయం

బాలీవుడ్ లో కరోనా టెన్షన్

బాలీవుడ్ లో కరోనా టెన్షన్

బాలీవుడ్ లో కరోనా టెన్షన్
ముంబై, జూన్ 6,
భారతదేశంలో  కరోనా కేసులు బాగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య అధికం కావడంతో ప్రభుత్వాలకు కూడా పాలుపోవడంలేదు. అత్యధికకంగా 24 గంటల్లో 9,304 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదు కావడం తొలిసారి. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,16,919కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ కారణంగా నిన్న ఒక్కరోజే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,075కు చేరింది. ఇటు కరోనా వైరస్ బాలీవుడ్ ప్రముఖుల్ని భయపెడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది చనిపోవడం, ఆస్పత్రుల పాలు కావడం జరుగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడి కోలుకుంది. తర్వాత మళ్ళీ అదే బాలీవుడ్ కు చెందిన మరో సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతరం మరో బాలీవుడ్ నిర్మాతకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మాత కరీంమొరానీతో సహా ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది.  తాజాగా ప్రముఖ నటి కుమారి సింగ్‌తో సహా ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని తేలింది. దీంతో  వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తామంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్‌కు వ్యాధి సోకింది. మరోవైపు సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ వైరస్ వల్ల మృతి చెందినట్లుగా తేలడంతో ఆయన కుటుంబ సభ్యులందరికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వాజిద్ ఖాన్ తల్లి రెజీనా కూడా వైరస్ బారిన పడింది. దీంతో ఆమెను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ది. కొడుకు అనారోగ్యంగా ఉండటం తో అతడిని చూసుకోవడానికి ఆమె అతనితో కలిసి ఉన్నారు. ఈ క్రమం లోనే వైరస్ సోకి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. త్వరలోనే వీరంతా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Related Posts