ఒక్క ఆలయం కుడా పున:నిర్మాణం చేయలేదు.
విజయవాడ జూన్ 6,
దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెల్లంపల్లి ఏడాదిలో ఒక్క ఆలయ పునః నిర్మాణం చేయలేదు. కొల్లగొట్టిన దేవాలయాలు పునః నిర్మించాలని ఎన్నో ధర్నాలు చేసాం. ఒక్క ఆలయం కూడా ఎందుకు పునః నిర్మించలేదో సమాధానం చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేసారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఆందోళనకు నాయకత్వం వహించిన శివస్వామి వైసీపీ సభ్యత్వం తీసుకున్నారని అనుమానం వస్తుంది. కరోనా విపత్కర పరిస్థితులు మంత్రి వెల్లంపల్లి కి కాసుల పంట పండించింది. వైసిపి నాయకులకు కరోనా పాజిటివ్ అని తేలినా.. క్వారంటైన్ కు పంపకుండా మంత్రి అడ్డుకున్నారు. మంత్రి నిర్లక్ష్యం వల్లే పశ్చిమ నియోజకవర్గం లో కరోనా కేసులు పెరిగాయని అయన అన్నారు. వీరి కారణంగా కరోనా వచ్చి.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు కూడా ఒత్తిడులకు లొంగకుండా నిబంధనల మేరకు నడచుకోవాలి. కలెక్టర్, సిపి లు స్పందించి వైసిపి నేతల పై చర్యలు తీసుకోవాలని అయన కోరారు.