రెవెన్యూ సిబ్బంది పై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
శ్రీకాకుళం జూన్ 6,
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లయిదాం గ్రామంలో ఎత్తిపోతల పథకం పనులు పరిశీలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భూమి పట్టాలపై సర్వే నిర్వహిస్తున్నందున భూసేకరణ ఎంతవరకు వచ్చిందని మండల తహసీల్దార్ ను ప్రశ్నించారు. మండల తహసీల్దార్ భూసేకరణ చేస్తున్నామని, వివరణ ఇవ్వగా, తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ ఖచ్చితంగా జరిగి తీరాలని లేదంటే మీ పై చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దారును హెచ్చరించారు. రెండు రోజుల్లో భూ సేకరణ పూర్తి కాకపోతే నీ పై ఎటువంటి చర్యలకైనా సిద్ధమేనని , ఉపేక్షించేది లేదని తెలిపారు.