YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

హోటల్స్, బేకరీల పై కార్పొరేషన్ అధికారుల దాడి

హోటల్స్, బేకరీల పై కార్పొరేషన్ అధికారుల దాడి

హోటల్స్, బేకరీల పై కార్పొరేషన్ అధికారుల దాడి
25 వేల రూపాయల జరిమానా
నెల్లూరు జూన్ 6 
నెల్లూరు నగరంలోని ప్రముఖ హోటల్స్, బేకరీ లపై కార్పొరేషన్ అధికారులు దాడి చేసి, హోటల్స్ లను సీజ్ చేయడంతోపాటు , 25 వేల జరిమానా కూడా విధించారు. కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఆధ్వర్యంలో నగరంలోని బాలాజీ నగర్ తదితర ప్రాంతాలలో రెండు ఓట్లను సీజ్ చేశారు. స్థానిక పూలే బొమ్మ వద్ద ఉన్న అలేఖ్య బేకరీ పై ఆకస్మిక దాడులు నిర్వహించి , 25 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని సూచించారు. ఆరోగ్యం ఆహారం విషయంలో లో లో ఎటువంటి లాలూచీ ల కు అవకాశమే లేదని , హోటల్ యాజమాన్యాలు, బేకరీ యాజమాన్యాలు ఎంతటి పలుకుబడిగల వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కార్యాలయ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts