కేటీఆర్ మంత్రికి రాజీనామా చేయాలి
రేవంత్రెడ్డి
హైదరాబాద్ జూన్ 7
మంత్రి కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని ఆరోపించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని, తన భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని తెలిపారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించడంపై గ్రీన్ట్రిబ్యునల్కు వెళ్లామని చెప్పారు. 8 మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని తెలిపారు. 301, 302 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణికి భూమి ఉందని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇస్తానని రేవంత్రెడ్డి ప్రకటించారు. అర్బణా వెంచర్స్కు కూడా అక్కడ భూమి ఉందని, అందులో కేటీఆర్కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఉందని తెలిపారు. ఆ భూములు లీజుకు తీసుకుంటే అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. ఎవరి దగ్గర లీజుకు తీసుకున్నారో, దాని యజమాని ఎవరో బయట పెట్టాలని, అక్కడ వారి భూములున్నట్లు తాను నిరూపిస్తానని, లేదంటే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్రెడ్డి ప్రకటించారు.