YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఏపీబీ వలలో ఆర్ఐ, ఎస్సై

ఏపీబీ వలలో ఆర్ఐ, ఎస్సై

ఏపీబీ వలలో ఆర్ఐ, ఎస్సై
హైదరాబాద్ జూన్ 6,
షేక్ పేట్  మండల ఆఫీస్ లో తన భూమి హద్దులు చూపించాలని బాధితుడు  దరఖాస్తు పెట్టుకున్నాడు. మరోవైపు, ఇదే విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది. బాధితుడు ల్యాండ్ పైకి వెళ్లడంతో షేక్ పెట్ తాసిల్దార్ ఏప్రిల్ నెలలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాసిల్దార్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ పెట్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, .. బాధితుడితో  నీకు ఫేవర్ గా చేయడానికి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసాడు. శనివారం నాడు బాధితుడినుంచి  15 లక్షలు రూపాయలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే కేసు విషయంలో బంజారాహిల్స్ లో పనిచేస్తున్న రవీందర్ నాయక్ బాధితుని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్షా 50 వేల రూపాయలను తీసుకున్నాడు. మళ్లీ కేసు నుండి నిన్ను తప్పించాలి అంటే మరో మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని బాధితుని డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై రవీందర్ నాయక్ పై కూడా కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts