YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

డబ్బు మోజులో పడి బాబాయి హత్య

డబ్బు మోజులో పడి బాబాయి హత్య

డబ్బు మోజులో పడి బాబాయి హత్య
ఏలూరు, జూన్ 07
డబ్బు మోజులో సొంతవాళ్లని సైతం హత్య చేసేందుకు వెనుకాడడం లేదు కొందరు దుర్మార్గులు. ఆస్తి కోసం సొంత బాబాయిని కత్తులతో నరికేసిన దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటనలో బాబాయి కాలు తెగిపడగా.. శరీరంపై తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అమానుష ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన రుద్రరాజు శ్రీనివాసరాజుకి తన అన్నతో ఆస్తి వివాదాలున్నాయి. అదే విషయమై ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాబాయిని అడ్డుతొలగిస్తే ఆస్తి వశమవతుందని భావించిన ఆయన అన్న కొడుకు వెంకట గాంధీరాజు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా సొంత బాబాయినే మట్టుబెట్టేందుకు పథకం రచించాడు.తన స్నేహితులతో కలిసి బాబాయిపై మారణాయుధాలతో దాడి చేశాడు. కత్తులతో విచక్షణా రహితంగా నరకడంతో అతని కాలు తెగిపడింది. మెడ, చేతులు, కాళ్లపై నరకడంతో తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో నేలకూలిన శ్రీనివాసరాజును అతని బంధువులు హుటాహుటిన తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు తీసుకెళ్లారు.తనపై అన్న కొడుకు గాంధీరాజు మరికొందరు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హత్యాయత్నం కుట్ర వెనుక తన అన్న భార్య, ఆమె బంధువులు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Posts