YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆగని కరోనా ఉగ్రరూపం

ఆగని కరోనా ఉగ్రరూపం

ఆగని కరోనా ఉగ్రరూపం
న్యూఢిల్లీ, జూన్ 8, 
కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడం.. ప్రజారవాణాను అనుమంతించడంతో పట్టణాల నుంచి గ్రామాలకు రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వైరస్ పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వ్యాపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు గ్రామాలకు చేరుకోవడంతో వారి ద్వారా కూడా కోవిడ్‌-19 విస్తృతమవుతోంది. దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10వేల మందికిపైగా కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య 2.46 లక్షలు దాటింది. దీంతో కరోనా వైరస్ కేసులు ప్రపంచంలోనే అత్యధికంగా నమోదయిన దేశాల జాబితాలో స్పెయిన్‌ను అధిగమించి, ఆరో స్థానానికి చేరింది. శనివారం ఏకంగా 10వేల కొత్త కేసులు బయటపడగా.. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.ప్రస్తుతం భారత్ కంటే అమెరికా (19.07 లక్షలు), బ్రెజిల్ (6.15 లక్షలు), రష్యా (4.59 లక్షలు), బ్రిటన్ (2.87 లక్షలు) ముందున్నాయి. దేశవ్యాప్తంగా 10,434 కొత్త కేసులు నమోదు కాగా.. తొలిసారి కరోనా మరణాలు 300 మార్క్ దాటాయి. దీంతో దేశంలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 6,946కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాలు రేటు 2.8శాతంగా ఉంది. మహారాష్ట్రలో శనివారం అత్యధికంగా 2,739 కొత్త కేసులు బయటపడ్డాయి.తమిళనాడులో 1,458, ఢిల్లీ 1,320, గుజరాత్ 498, బెంగాల్ 435, ఉత్తరప్రదేశ్ 382, కర్ణాటక 378, హర్యానా 355, రాజస్థాన్ 253, అసోం 244, బీహార్ 233, మధ్యప్రదేశ్ 232, ఆంధ్రప్రదేశ్ 210, తెలంగాణ 206, ఒడిశా 173, కేరళ 108, ఝార్ఖండ్ 106, గోవా 70 కొత్త కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో  అత్యధికంగా 120 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,969 చనిపోయారు. కేవలం ముంబయిలోనే 58 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ ముంబయి నగరంలో 1,577 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 53 మంది, గుజరాత్ 29, తమిళనాడు 19, బెంగాల్ 17, మధ్యప్రదేశ్ 15, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 11, తెలంగాణలో 10 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 82,400 దాటగా.. ముంబయిలోనే 47,354 మందికి వైరస్ సోకింది.గుజరాత్‌లో మొత్తం బాధితుల సంఖ్య 19,617కి చేరగా.. యూపీలో 10వేల మార్క్ దాటింది. కేవలం 18 రోజుల్లోనే 5వేలకుపైగా కొత్త కేసులు యూపీలో నమోదుకావడం గమనార్హం. శనివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,46,585కు చేరాయి. మొత్తం 6,895 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,18,918 మంది కోలుకున్నారు. కరోనా కేసుల సంఖ్యలో శనివారం ఉదయానికి ఇటలీని వెనక్కి నెట్టిన భారత్‌.. తాజాగా స్పెయిన్‌ను కూడా దాటి ప్రపంచంలోనే అత్యధికంగా కేసులున్న దేశంగా నిలిచిందని జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. దేశంలోనే మొత్తం బాధితుల్లో సగం మంది నాలుగు మెట్రోనగరాలు దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Related Posts