YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గ్యాంగ్ వార్ పై డీసీపీ వివరణ

గ్యాంగ్ వార్ పై డీసీపీ వివరణ

గ్యాంగ్ వార్ పై డీసీపీ వివరణ
ఘర్షణకు కిరణే కారణం
విజయవాడ జూన్ 08 
బెజవాడ గ్యాంగ్వార్పై పోలీసులు పురోగతి సాధించారు.  శనివారం నాడు డీసీపీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడారు. 
సెటిల్మెంట్ విషయంలోనే పండు-సందీప్ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. గ్యాంగ్ వార్ ఘటనలో ఇప్పటి వరకూ మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సందీప్ హత్యకు కారణమైన 13 మందిని.. అలాగే పండుపై దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అపార్ట్మెంట్ విషయంలో సెటిల్మెంట్ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. 
అయితే పండు-సందీప్ వర్గాలు కలుసుకున్నప్పుడు సందీప్ గ్యాంగ్ ముందు పండు కుర్చీలో నుంచి లేవకపోవడం.. పిల్లోడివి ''నా ముందే కుర్చుంటావా'' అంటూ సందీప్ వర్గానికి చెందిన కిరణ్ కుమార్ కర్రతో రెండు సార్లు కొట్టడంతో ఒక్కసారిగా గొడవ చెలరేగిందని వివరించారు. ఈ గొడవంతటికి కిరణే కారణమని, అతడు రెచ్చగొట్టడం వల్లే ఘర్షణకు దారి తీసిందని డీసీపీ స్పష్టం చేశారు.  సెటిల్మెంట్ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సందీప్.. పండు ఇంటికెళ్లి బెదిరించాడన్నారు. ఆ తర్వాత పండు కూడా సందీప్ షాపుకు వెళ్లి కత్తితో హల్చల్ చేశాడన్నారు.  రెండు గ్యాంగుల్లో ఉన్నవారంతా క్రిమినల్సేనన్నారు. మంగళగిరి, తాడేపల్లిలో రౌడీషేటర్లను అదుపులోకి తీసుకున్నాం. అందరికీ క్రిమినల్ హిస్టరీ ఉందని పేర్కొన్నారు. సందీప్ తన ఫ్రెండ్స్నే ఉపయోగించుకున్నాడన్నారు. వీళ్లంతా స్కూళ్లలో పరిచయం ఉందని వివరించారు. బెదిరించాలని వెళ్తే.. చంపుకునేంత వరకూ వెళ్లిందన్నారు.  సందీప్ కుటుంబ సభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదు సందీప్ హత్య వెనుక రాజకీయ నేతల హస్తం ఉందన్న ఆయన భార్య తేజస్వని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీసీపీ అన్నారు. సందీప్ హత్య వెనుక ఎలాంటి రాజకీయ నాయకులు లేరని తేల్చి చెప్పారు.  కేవలం మంగళగిరి కి చెందిన రౌడీషేటర్ కిరణ్ అనే వాడు రెచ్చగొట్టడం వల్లే గొడవకు కారణమని చెప్పారు.  నిందితుల్లో ముగ్గురు మంగళగిరి నుంచి వచ్చారన్నారు. పండు తల్లికి క్రిమినల్ హిస్టరీ ఉందన్నారు. ఓ కేసులో ఆమె పేరు ఉందని తెలిపారు.  ఆమె పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  ఆమె పాత్ర ఉందని తేలితే అరెస్ట్ చేస్తామని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు.

Related Posts