YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఒక్క శాతం తప్పు ఉన్నా శిక్షకు సిద్ధం

ఒక్క శాతం తప్పు ఉన్నా శిక్షకు సిద్ధం

ఒక్క శాతం తప్పు ఉన్నా శిక్షకు సిద్ధం
హైద్రాబాద్, జూన్ 8,
తెలంగాణలో ఫామ్‌హౌస్ పంచాయితీ కొనసాగుతోంది. రేవంతర్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన విమర్శలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జన్వాడలో మంత్రి కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్‌హౌస్ కట్టారని.. ఆ పార్టీ విప్బాల్క సుమన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. కేటీఆర్ నాలుగేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారని .. సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం.. కుటుంబ సభ్యులతో ఉంటారని చెప్పారు స్వయంగా సుమనే ఒప్పుకున్నారన్నారు.మార్చి 5న ఈ సమస్యపై డ్రోన్ కెమెరా ఉపయోగించానని తనతో పాటూ 8మంది కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారని.. ఆ సందర్భంగా నా బెయిల్ సమయంలో మెజిస్ట్రేట్ ముందు పోలీసులు ఓ మెమో ఫైల్ చేశారని కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి తీరుతో కేటీఆర్ ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబానికి.. ఆస్తులకు ప్రమాదం ఉందని.. బెయిల్ ఇవ్వొద్దన్నారని.. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే సుమన్, పోలీసులు ఆ ఫామ్‌హౌస్ కేటీఆర్‌దే అని ఒప్పుకున్నారన్నారు రేవంత్.కేటీఆర్ జన్వాడ దగ్గర తనకు ఆస్తులు లేవన్నారు.. కానీ ఆయన సతీమణి పేరు మీద భూములు ఉన్నాయని రేవంత్ చెప్పుకొచ్చారు. 2019 మార్చి ఓ సేల్ డీడ్ జరిగిందని.. ఇది కల్వకుంట్ల శైలిమ, వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారకరామారావు పేరు మీద ఉందన్నారు. 301 సర్వే నెంబర్‌లో 2 ఎకరాల రెండు కుంటలు సేల్ డీడ్ ఉందన్నారు. 2019 మేలో కూడా మరో డాక్యుమెంట్ ఉందని.. అందులో శైలిమ పేరుతో ఎకరం పై భూమి ఉందన్నారు. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో పేజ్ నెంబర్ 20లో ఎఫ్ కాలంలో 2కోట్ల 70లక్షల విలువచేసే అర్బనా అవెంచర్స్ పేరు మీద భూమి ఉందని తెలిపారన్నారు. భూములు ఉన్నా కేటీఆర్ బుకాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు.కోర్టుకు ఇచ్చిన నివేదికల్లో, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలను బట్టి జన్వాడ గ్రామంలో కేటీఆర్‌కు రెండు ప్రాంతాల్లో భూములు ఉన్నాయని రేవంత్ చెప్పుకొచ్చారు. కేటీఆర్, ఆయన దండు తన అక్రమ నిర్మాణాలను చూపించాలని.. 1990లో అక్రమ భూముల విషయంలో బాధ్యత వహిస్తూ కోనేరు రంగారావు మంత్రి పదవికి రాజీనామా చేశారని.. విచారణలో తనకు సంబంధం లేదని తెలిశాకే మంత్రి పదవి చేపట్టారని గుర్తు చేశారు. మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌ను ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్, ఆయన సతీమణి పై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదని, కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే బయటకు వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. తన ఆరోపణల్లో ఒక్క శాతం తప్పు ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధమన్నారు రేవంత్.

Related Posts