YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో దారుణమైన పరిస్థితులు

తెలంగాణలో దారుణమైన పరిస్థితులు

తెలంగాణలో దారుణమైన పరిస్థితులు
హైద్రాబాద్, జూన్ 8,
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయన్న సంజయ్.. ఆదివారం ఒక్క రోజే 14 మంది కరోనా వల్ల చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. టెస్టుల నిర్వహణలో, బాధితులకు చికిత్స అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.70 మందికిపైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడటం దురదృష్టకరం అన్న బీజేపీ నేత.. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కోవిడ్ విభాగంలో పని చేసే డాక్టర్లందరికీ ప్రత్యేక రూములు కేటాయిస్తామని చెప్పినా.. ఇంత వరకూ దాన్నినెరవేర్చలేదన్నారు. డాక్టర్లు రకరకాల పేషెంట్లకు చికిత్స అందిస్తారు. పేషెంట్ ఎక్కడి నుంచి వస్తాడో వాళ్లకు తెలీదు. కానీ రోగులకు చికిత్స అందించే డాక్టర్లకు కనీసం ఎన్-95 మాస్కులు కూడా ప్రభుత్వం అందించడం లేదని సంజయ్ ఆరోపించారు.రాష్ట్రంలో ఎన్ని కరోనా టెస్టులు చేశారు.. ఎంత మందికి పాజిటివ్ వచ్చింది.. ఎంత మందికి చికిత్స అందిస్తున్నారు.. ఎంత మంది చనిపోతున్నారనే విషయం సరిగా చెప్పడం లేదని సంజయ్ ఆరోపించారు. టీవీ జర్నలిస్ట్ కరోనాతో మరణించగా.. రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులందరికీ కరోనా టెస్టులు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Posts