YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రోడెక్కిన బస్సులు

రోడెక్కిన బస్సులు

రోడెక్కిన బస్సులు
హైద్రాబాద్, జూన్ 8, 
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కొన్ని నగరాలు, పట్టణాలు మినహా అన్నిచోట్లా సర్వీసులు నడుస్తున్నాయి. ఇక అంతర్రాష్ట సర్వీసులపై గందరగోళం కొనసాగుతోంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు సిద్ధమంటుంటే.. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలు మాత్రం నో అంటున్నాయి. ఈ నెల 8వ నుంచి బస్సులు ప్రారంభించాలని భావించిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగా ఏపీఎస్‌ ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.ఈ లేఖలపై తెలంగాణ ప్రభుత్వం ఆచీతూచీ స్పందిస్తోంది. బస్సుల్ని అనుమతించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామంటోంది. కరోనా ప్రభావం తగ్గే వరకు హైదరాబాద్‌లో బస్సుల్ని తిప్పకూడదని భావిస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాల బస్సుల్ని అనుమతించే విషయంలో కాస్త తర్జనభర్జనలో ఉంది. అటు కర్ణాటక ప్రభుత్వానిది అదే పరిస్థితి.. అక్కడ కూడా కరోనాను కంట్రోల్ చేసే పనిలో ఉన్న ప్రభుత్వం.. బస్సుల్ని అనుమతించడం కష్టమే. దీంతో అంతర్రాష్టాల మధ్య బస్సు సర్వీసులకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.తాజాగా అంతర్రాష్ట బస్సు సర్వీసులు నడిపే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్‍ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‍ కృష్ణబాబు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు ఆర్టీసీ బస్సు సర్వీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని.. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక బస్సులు నడుపుతామని చెబుతున్నారు. ప్రభుత్వం సర్వీసులు నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసినా.. పొరుగు రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం అధికారులు వేచి చూస్తున్నారు.

Related Posts