YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అమిత్ షాపై రాహుల్ సెటైర్లు

అమిత్ షాపై రాహుల్ సెటైర్లు

అమిత్ షాపై రాహుల్ సెటైర్లు
న్యూఢిల్లీ, జూన్ 8
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో అందరికి తెలుసంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకి రాహుల్ చురకలంటించారు. అమెరికా, ఇజ్రాయెల్ తరవాత సరిహద్దులను రక్షించుకోగల సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. హృదయాన్ని సంతోషంగా ఉంచడానికి మంచి ఆలోచన అవసరం’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రముఖ ఉర్దూ-పర్షియా కవి మీర్జా గలీబ్ రాసిన కవితను రాహుల్ తన ట్వీట్‌లో వాడటం విశేషం.భారత్-చైనా సరిహద్దుల్లో గత నెల రోజులుగా ఉద్రిక్త వాతావారణం నెలకొన్న సంగతి తెలిసిందే. చర్చల ద్వారా ఈ ప్రతిష్టంభనను ముగింపు పలకాలని ఇరుదేశాలు నిర్ణయించి, ఆ దిశగా ముందుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు‘బిహార్ జన్‌సంవద్ వర్చువల్ ర్యాలీ’లో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. పుల్వామా, ఉరి ఉగ్రదాడుల తర్వాత సర్జికల్, ఎయిర్ స్ట్రయిక్స్ ద్వారా భారత్ రక్షణ విధానంపై బలమైన సందేశం పంపిందని, సరిహద్దులను ఎలా రక్షించుకోగలమో చెప్పిందన్నారు.మన దేశ రక్షణ విధానం ప్రపంచ ఆమోదాన్ని పొందింది.. అమెరికా, ఇజ్రాయెల్ తరవాత సరిహద్దులను పరిరక్షించుకోగల సామర్థ్యం ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారత్ అని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని షా చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులను అదుపుచేయడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని షా ధ్వజమెత్తారుసరిహద్దుల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే మన సైన్యం శిరచ్ఛేదనం చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదు.. ఉరి, పుల్వామాలో ఉగ్రదాడులు జరిగితే సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో శత్రువులపై విరుచుకుపడ్డామని, ఇది మోదీ, బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. అంతేకాదు, 70 ఏళ్లుగా పరిష్కారం కాని కశ్మీర్ సమస్యను రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మోదీ ప్రభుత్వం చేసిచూపిందన్నారు.

Related Posts