YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 సీఐ బాధ తట్టుకోలేక ఆత్మహత్య

 సీఐ బాధ తట్టుకోలేక ఆత్మహత్య

 సీఐ బాధ తట్టుకోలేక ఆత్మహత్య
కర్నూలు, జూన్ 9,
కర్నూలులో ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. కర్నూలు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ భవనంలోని కంట్రోల్‌ రూంలో సోమవారం మధ్యాహ్నం మహిళా హెడ్ కానిస్టేబుల్‌ పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు యత్నించింది. దీంతో తోటి ఉద్యోగులు ఆమెను అడ్డుకుని సముదాయించారు.అయితే తన చావుకు సీఐ దంపతులు, ఏఎస్ఐ వేధింపులే కారణమని అంతకుముందే ఆమె పలువురికి ఫోన్లో మెసేజ్ చేసింది. సీఐ తన దగ్గర రూ.70వేలు అప్పు తీసుకున్నారని, తిరిగివ్వాలని కోరగా తన భార్యతో తిట్టించినట్లు బాధితురాలు చెబుతోంది. దీనికి తోడు ఏఎస్ఐతో కలిసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తన పరువు పోయేలా కొందరితో సంబంధాలున్నట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆమె వాపోయింది. అయితే స్టేషన్‌లోనే మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నించిన ఘటన జిల్లా ఎస్పీ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నాడు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పెషల్ బ్రాంచ్‌ పోలీసులను ఆదేశించారు.

Related Posts