YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఐదు రాష్ట్రాల్లో కరోనా టెన్షన్

 ఐదు రాష్ట్రాల్లో కరోనా టెన్షన్

 ఐదు రాష్ట్రాల్లో కరోనా టెన్షన్
అంచనా వేసిన హైపవర్ కమిటీ
న్యూఢిల్లీ, జూన్ 9
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేర్వేరు సమయాల్లో తీవ్రం కావచ్చని ఆరోగ్యంపై నియమించిన 15వ ఆర్థిక కమిషన్ ఉన్నత స్థాయి కమిటీ అంచనా వేసింది. మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి రాష్ట్రాల మధ్య వనరులను సమీకరించాలని సూచించింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అధ్యక్షత ఏర్పాటయిన ఉన్నతస్థాయి కమిటీ మహమ్మారిని ఎదుర్కోడానికి యంత్రాంగం అవసరాన్ని నొక్కిచెప్పింది. దీని ద్వారా సిబ్బంది, వైద్య పరికరాలు వంటి ఆరోగ్య వనరులను అవసరానికి అనుగుణంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలించవచ్చని తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగ్గానే ఉన్నాయని, కరోనా వైరస్ కేసులు పెరిగినా సమర్ధంగా ఎదుర్కోగలవని డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. అయితే, పలు రాష్ట్రాలకు ఇది పెద్ద సవాల్‌తో కూడుకున్నదని అన్నారు.ప్రస్తుత గణాంకాల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితిని అంచనా వేసిన ఈ కమిటీ.. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఇంకా పెరుగుతుందని అంచనాకు వచ్చింది. ఏదేమైనా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నా సమస్యలు కొనసాగుతున్నాయి. మొత్తంమీద, మే 14 నుంచి మే 18 వరకు కరోనా వైరస్ సగటు రోజువారీ వృద్ధి రేటు సుమారు 5.1% గా అధ్యయనంలో అంచనా వేసింది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ మాట్లాడుతూ.. దేశంలో కోవిడ్ -19 వక్రత ఇంకా కీలక దశకు చేరుకోలేదన్నారు. అయితే ఈ ప్రభావం రెండు, మూడు సంవత్సరాల పాటు ఉంటుందని తెలిపారు. మరణాలు రేటులోనూ అంతరం లేదని, అయినప్పటికీ ఈ రేటును 5% కన్నా తక్కువ ఉంచడం చాలా అవసరమని పేర్కొన్నారు. మరణాల సంక్య రోజుకు 1,000-2,000 కు పెరిగితే భయానకంగా మారుతుందని హెచ్చరించారు.మహారాష్ట్ర, గుజరాత్ మినహా ప్రస్తుతం అన్ని చోట్ల ‘ట్రాక్, ట్రేస్ అండ్ ట్రీట్’ వ్యూహం బాగా పనిచేస్తుందని ఐసిఎంఆర్ గుర్తించింది. గత నెలలో సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ.. చాలా స్వల్ప, స్వల్ప, మధ్యకాలిక ఇలా మూడు విస్తృత సమూహాలను సిఫార్సులు చేసింది. చాలా స్వల్పకాలిక చర్యలలో నిఘా, నియంత్రణ, ఖర్చుతో కూడుకున్న ఔషధాల సరఫరా, గ్రామీణ మొబైల్ హెల్త్ యూనిట్లు, వెంటిలేటర్లు, పీపీఇలు, మాస్క్‌లు, నిరంతర ఆక్సిజన్ సరఫరా, కోవిడ్ కోసం 'హాప్ ఇన్ హాప్ ఆఫ్' సేవల కోసం వేగవంతమైన పరీక్ష వంటివి ఈ సిఫార్సుల్లో ఉన్నాయి.స్వల్పకాలిక చర్యల్లో ఆరోగ్య రంగం కోసం ‘వ్యాప్తి నిర్వహణ ప్రణాళిక’, టీకా అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడం వంటివి ఉన్నాయి. ఆరోగ్యంపై పెట్టుబడులు పెంచడం, ఆరోగ్య సిబ్బంది కొరతను పరిష్కరించడం, ఆయుష్మాన్ భారత్ కింద మిగిలిన 60 శాతం జనాభాను చేరేందుకు అవకాశాలను అన్వేషించడం, మధ్యంతర చర్యలుగా భారతీయ పౌర సేవల నమూనాపై అఖిల భారత వైద్య సేవలను ఏర్పాటు చేయాలని ప్యానెల్ సూచించింది.

Related Posts