YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

కిడ్నాప్ కథ సుఖాంతం

కిడ్నాప్ కథ సుఖాంతం

బాలుడి కిడ్నాప్ ఉదంతం కొన్ని గంటల్లోనే సుఖాంతం అయింది. గత ఆదివారం ఉదయం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటెళ్ళి ఊరగట్టు తాండాకు చెందిన చంద్రు నాయక్  (8) ను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కొత్తకోట పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపులు ప్రారంభించారు. కిడ్నాపర్ ఫోన్ నెంబర్ సిగ్నల్స్ తో వేట ప్రారంభించారు. కిడ్నాపర్ మహరాష్ట్రలోని పుణేలో వున్నట్లు నిర్దారించారు. హైదరాబాద్,పూణే పోలీసుల సహకారం తో పకడ్బందీ వ్యూహం తో అదే రోజు రాత్రి  రెండు గంటల సమయంలో  నిందిడుని  పూణే లో అదుపులోకి తీసుకున్నారు. పూణే కోర్టు లో నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్ కోసం హాజరుపరిచి వనపర్తికి తరలించారు.  గంటల్లోనే కిడ్నాప్ మీస్టరీని ఛేదించినందుకు కొత్తకోట సీఐ సోమ్ నారాయణ సింగ్ యస్ఐ రవికాంత్ రావు పోలీస్ ల బృందాన్ని పోలీసు ఉన్నాతాధికారులు అభినందించారు.

Related Posts