రెండో దశ పోరుకు సిద్ధమవుతున్న రైతులు
అమరావతి జూన్ 9,
రాజధాని అమరావతి కోసం స్థానిక రైతులు రెండో దశ పోరుకు సిద్ధమవుతున్నారు. రాజధాని నగర నిర్మాణానికి 33వేల ఎకరాల భూమి ఇచ్చి చరిత్ర సృష్టించిన అమరావతి రైతులు తమకు న్యాయం చేయాలంటూ చేస్తున్న ఉద్యమం మంగళవారానికి 175 రోజులకు చేరింది. పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు న్యాయపోరాటం సాగిస్తున్నారు రైతులు.ఉద్యమంపై హైకోర్టు జోక్యం చేసుకోన్న విషయం కుడా తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ‘ఇంటింటా అమరావతి’, ‘అమరావతి వెలుగు’ పేరుతో వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ అనంతరం జూలై 1 నుంచి రెండో దశ పోరుకు సిద్ధమవుతున్నట్లు రైతులు, స్థానికులు, మహిళలు చెబుతున్నారు.