YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది కూలీలు దుర్మరణం చెందారు.రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఎదురై కూలీల బతుకును చిదిమేసింది. 17 మందిని బలిగొంది.ముంబయి- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణ కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు ఈ ఉదయం 4.30గంటల ప్రాంతంలో సతారా జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖాంబట్కీ ఘాట్‌ వద్ద మూల మలుపు తిరుగుతుండగా ట్రక్కు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు.సమాచారమందుకున్న ఖండాలా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. ఘటన సమయంలో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే వాహనం అదుపుతప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. కూలీలంతా కర్ణాటకలోని బిజాపూర్‌ జిల్లా వాసులు. పుణెలో ఓ భవన నిర్మాణ పనులకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. ఊరు గాని ఊరొచ్చి పొట్టకూటి కోసం కూలి పని చేసుకుంటున్న వారి జీవితాలను విధి వంచించింది.

Related Posts