YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇళ్ల స్థలాల పేరుతో భూదందా

ఇళ్ల స్థలాల పేరుతో భూదందా

ఇళ్ల స్థలాల పేరుతో భూదందా
టిడిపి నేత బీదా రవిచంద్ర 
నెల్లూరు జూన్ 09 
పేదలకు ఇళ్ల స్థలాలు నెపంతో రాష్ట్రప్రభుత్వం భూదందాకు తెరలేపిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు  బీద రవిచంద్ర ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు ఇస్తామన్న సాకుతో రైతులను బెదిరించి భూములను లాక్కున్నారన్నారు. వైసీపీ నేతలు రైతులకు నామమాత్రంగా పరిహారం చెల్లించి రెండు రెట్లకు ఆ భూమిని అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీని టిడిపి నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో వైయస్ జగన్ తనకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని హామీ ఇచ్చారని ఏడాది అవుతున్న ఆ హామీ ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. ప్రజా వేదిక విధ్వంసంతో ఈ ప్రభుత్వం గత ఏడాదిగా పాలన సాగించిందన్నారు. కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవడమే ఈ ప్రభుత్వం కు పనిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts