YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

11న ఛలో సెక్రటేరియెట్

11న ఛలో సెక్రటేరియెట్

11న ఛలో సెక్రటేరియెట్
హైద్రాబాద్, జూన్ 9,
కరోనా విషయంలో రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఏ రకమైన కుట్రలు జరిగాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ కుట్ర జరిగినప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద పెద్ద యంత్రాంగం ఉందన్న భట్టి.. ఆ కుట్రను ఎందుకు కనుక్కోలేరని నిలదీశారు. ఆ కుట్రదారుడు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన భట్టి సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ క్షేమంగా ఉన్నారన్న భట్టి.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయారని.. పేదలు కరెంట్ బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్నారన్నారు. ఉపాధి కోల్పోయిన వారికి మూడు నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులను మూడు వాయిదాల్లో చెల్లించొచ్చని.. కాకపోతే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ... కరెంట్ బిల్లులపై వడ్డీ వసూలు చేయడం ఏంటన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం సూచించిన పంటలన సాగు చేసిన రైతులకు రైతు బంధు ఇవ్వడం సరికాదన్న కాంగ్రెస్ నేత.. రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. తరైతు బంధు, విద్యుత్ బిల్లుల విషయాలపై మంత్రులను కలిసేందుకుగాను ఈ నెల 11వ తేదీన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Related Posts