YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 కన్నకూతురుపై అత్యాచారం

 కన్నకూతురుపై అత్యాచారం

 కన్నకూతురుపై అత్యాచారం
గుంటూరు, జూన్ 9, 
ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. సమాజంతో పాటు ఇంట్లోనూ వారికి రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ కామాంధుడు కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఏలీయా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతడికి ఓ కుమార్తె ఉంది. మద్యానికి బానిసై అతడు రోజూ తాగి ఇంటికొచ్చేవాడు.ఈ క్రమంలోనే ఇటీవల ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఇంటికొచ్చిన ఏలీయా వావి వరుసలు మరిచి నిద్రపోతున్న కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. కొద్దిరోజుల తర్వాత తల్లికి ఈ విషయం చెప్పి బోరుమంది. ఆమె తన కూతురిని వెంటబెట్టుకుని పెదనందిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఏలీయాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Related Posts