జ్యోతిరాదిత్యకు కరోనా పాజిటివ్..?
భోపాల్, జూన్ 9,
బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయన తల్లి మాధవి రాజే సింధియా కరోనా లక్షణాలతో ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో చేరారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వీరిద్దరికి కరోనా టెస్టులు చేయగా.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా ఆయకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో జ్యోతిరాదిత్య సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ హాస్పిటల్లో చేరారు. ఆయనకు గొంతు నొప్పి రాగా.. ఆయన తల్లిలో మాత్రం లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఇంతకు ముందు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రలోనూ కరోనా లక్షణాలు కనపించాయి. గురుగ్రామ్లోని మెదాంత హాస్పిటల్ చేరిన సంబిత్ సోమవారమే డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం జ్వరం, గొంతు నొప్పిత బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆయనకు కరోనా టెస్టులు చేశారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు.మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడంతో కమల్నాథ్ సర్కారు కూలిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. ఆయనకు శివరాజ్ సింగ్ చౌహాన్కు మధ్య పొసగడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా పార్టీలో చేరిన వెంటనే సింధియాను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది.