మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు వైకాపా నేతల వార్నింగ్
విశాఖపట్నం జూన్ 9
ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం చిన గంట్యాడ లోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆ పార్టీ నాయకుడు తిప్పాల దేవన్ రెడ్డి మాట్లాడారు తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎటు వంటి భూ కబ్జాలకు, ఆవనీతికి పాలుపడలేదన్నారు.అధికారం లేక ,చేసేందుకు ఏ పదవి లేక ఇలా అసత్య ఆరోపణులకు తెగబడుతూ పల్లా తన నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నారన్నారు.నిత్యం పార్టీలు మారి ఏ సమయంలో ఏ పార్టీలో వుంటాడో తెలియని పల్లా చే నీతులు చెప్పించుకునే గతి తమకు పట్టలేదన్నారు.పల్లా చేసిన భూ కబ్జాలకు, ప్రభుత్వ భూములు ఆక్రమనలు సాక్ష్యం గా నిలుస్తాయని అన్నారు.నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే నాగిరెడ్డి చేస్తున్న సేవలు నియోజకవర్గ ప్రజలకు కార్యాకర్తలకు తెలుసని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యాకర్తలు పాల్గోన్నారు