సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట సైదులు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గుర్తించిన కార్యాలయ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. సబ్సీడీ కింద ఇచ్చిన ట్రాక్టర్ను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారని మనస్తాపంతో రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రైతు సైదులు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి వాసిగా తెలుస్తోంది.