చీరాలలో వైకాపా కార్యాలయం ప్రారంభం
ఒంగోలు జూన్ 10
ప్రకాశం జిల్లా చీరాలలో స్థానిక నవ్య కేబుల్ వద్ద మునిసిపల్ కాంప్లెక్స్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ బుధవారం ప్రారంబించారు. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. అమంచి మాట్లాడుతూ పట్టణంలో అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన చాలా గొప్పగా ఉందని ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్ధానాలన్నింటిని కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని తెలిపారు.