YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా తీర్థం పుచ్చుకున్న పల్లాల శ్రీనివాసులు

వైకాపా తీర్థం పుచ్చుకున్న పల్లాల శ్రీనివాసులు

వైకాపా తీర్థం పుచ్చుకున్న పల్లాల శ్రీనివాసులు
నెల్లూరు జూన్ 10 
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ అ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది అనుచరులతో పల్లాల శ్రీనివాసులు బుధవారం స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇ సమక్షంలో వైకాపా తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని కోరుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి సేవలతో పాటు, నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి సేవలకు ఆకర్షితుడై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు  ఎమ్.ఆర్.పి.ఎస్. నాయకులు కార్యకర్తలు వైకాపా కండువా కప్పుకోవడం  హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా  నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ  పల్లాల శ్రీనివాసులు అతని మిత్ర బృందంతో వైకాపాలో చేరడం సంతోషదాయకం అన్నారు. పార్టీలోకి చేరిన వారికి పార్టీలో ప్రముఖ స్థానం లభింప చేయడమే కాకుండా, వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. పార్టీలో పాత కొత్త కలయికతో నెల్లూరు నగర గ్రామీణ ప్రాంతాలతోపాటు, నెల్లూరు జిల్లాలో వైకాపా బలపడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పటిష్టంగానే ఉంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts